తెలంగాణ
కూకట్ పల్లిలో కారు బీభత్సం.. మద్యం మత్తులో యువతి హల్చల్

Hyderabad: హైదరాబాద్ కూకట్ పల్లిలో కారు బీభత్సం చేసింది. మద్యం మత్తులో యువతులు కారుతో హల్చల్ చేశారు. బైకులను ఢీకొట్టారు. అంతేకాదు బైకు వాహనదారుడిని బెదిరించారు యువతులు. ఈ ఘటన కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ వద్ద జరిగింది. వెంటనే బైకు వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్టు తెలిపారు. యువతులు మద్యం సేవించినట్టు తెలిపిన పోలీసులు కారులో బీర్ టిన్నులను గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.