తెలంగాణ
Vemulawada Temple: రాజన్న ఆలయంలో హుండీ నగదు చోరీ..

Vemulawada Temple: సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ నగదు దొంగతనం జరిగింది. ముగ్గురు మైనర్లు సాధారణ భక్తుల్లా ఆలయానికి వచ్చి.. హుండీలోని నగదు దొంగలిస్తూ సిబ్బందికి చిక్కారు. పోలీసులు వారిని పట్టుకొని.. 2 వేల 800 రూపాయిలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో 10 వేలు కాజేసినట్లు మైనర్లు తెలిపినట్లు తెలుస్తోంది.