ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు

Tirumala: తిరుమలలో శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలు కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్టమెంట్లు,9 షెడ్లు పూర్తిగా నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో బారులు తీరున్న భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. మొదటి నాలుగురోజుల్లో 2,85,566 మంది భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారు.
నిన్న అత్యధికంగా 83,032 మంది భక్తులకు దర్శనభాగ్యం లభించింది. శుక్రవారం నాడు ఇంత పెద్దసంఖ్యలో భక్తులకు దర్శనం కల్పించడం ఇదే మొదటిసారి రద్దీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సర్వదర్శనం క్యూలోకి ప్రవేశించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి భక్తులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి.



