Betting Apps Case: సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ కేసులో మరో మలుపు

Betting Apps Case: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంచలనంగా మారింది. పోలీసులు గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు.
పంజాగుట్టలో 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లు, మియాపూర్లో 25 మంది నటీనటులపై కేసులు దాఖలయ్యాయి. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి ప్రముఖులపైనా కేసులు నమోదయ్యాయి.
తాజాగా, మియాపూర్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను కూడా నిందితులుగా చేర్చారు. 19 యాప్స్లో ఏ23, జంగ్లీ రమ్మీ, ఫెయిర్ప్లే, జీత్విన్ వంటివి ఉన్నాయి. సెలబ్రిటీలకు నోటీసుల ముందు పోలీసులు న్యాయ సలహా తీసుకున్నారు.
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ నిషేధం ఉన్నప్పటికీ, నిర్వాహకులు విభిన్న పేర్లతో యాప్స్ను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ యాప్స్ నిర్వాహకులే ప్రధాన కారణమని, వారిని విచారించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ప్రస్తుతం నిర్వాహకుల కోసం గాలింపు జరుగుతోంది.