ఆంధ్ర ప్రదేశ్
TTD: మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త వైఖానస ఆగమ సలహా కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఐదు మంది ఆగమ సలహా మండలి సభ్యులను నియమిస్తూ టీటీడీ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ప్రధాన అర్చక హోదాలో శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు నియామకం అయ్యారు.
వేదిక్ యూనివర్సిటీ నుండి భావ నారాయణ చార్యులు, చెన్నైకి చెందిన వరదన్ బట్టాచార్యర్, గోవిందరాజ స్వామివారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు అనంతశయన దీక్షితులు, మాజీ శ్రీవారి ఆలయ అర్చకులు ఖాద్రి నరసింహాచార్యులను టీటీడీ నియమించింది. అయితే ఈ ఆగమ సలహా మండలికి విధి విధానాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.