ఆంధ్ర ప్రదేశ్

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. దర్శనం టికెట్లు, గదులు, ఆర్జిత సేవలు బుక్ చేసుకోండి..

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. 2025 మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత, దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు 2025 మార్చి నెల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే తిరుమల వర్చువల్ సేవ టికెట్లు, ఉచిత ప్రత్యేక దర్శనం. అంగ ప్రదక్షిణం టోకెన్లు, వసతి గదులు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు సంబంధించి 2025 మార్చి నెల కోటాను ఏయే తేదీల్లో విడుదల చేస్తామనే దానిపై టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. 2025 మార్చి నెలకు సంబంధించి శ్రీ‌వారి దర్శనాలు, వసతి గదులు, ఆర్జిత సేవ టికెట్ల ఆన్‌లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు తేదీలను ఆయా వెల్లడిస్తూ టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను డిసెంబ‌రు 18న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 20వ తేదీ ఉదయం పది గంటల వరకూ ఈ సేవాటికెట్ల రిజిస్ట్రేష‌న్‌ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుంచి డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత లక్కీడిప్‌లో టికెట్లు కేటాయిస్తారు.

అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ వంటి ఆర్జిత సేవా టికెట్లను డిసెంబ‌రు 21న విడుదల చేస్తారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. అదే రోజు (డిసెంబర్ 21) మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 2025 మార్చి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అలాగే 2025 మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు.

మరోవైపు వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీటీడీ ప్రత్యేక దర్శన సదుపాయం కల్పిస్తోంది. వీటికి సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శనం 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. అలాగే డిసెంబరు 24న ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల కానుంది. తిరుమల, తిరుపతిలో వసతికి సంబంధించి 2025 మార్చి నెల వసతి గదుల కోటాను డిసెంబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button