Donald Trump: ఇండియా పేరు ఎత్తొద్దు.. ఆపిల్ సీఈఓ కు ట్రంప్ ఆదేశం

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్తో మాట్లాడుతూ, తాను ఇండియాలో ప్లాంట్లు పెట్టొద్దన్నాడు. భారతదేశం తమను తాము చూసుకోగలదన్నాడు. దోహాలో జరిగిన ఒక వ్యాపార కార్యక్రమంలో, అమెరికా అధ్యక్షుడు టిమ్ కుక్తో తనకు చిన్న సమస్య ఉందనన్నాడు. మిమ్మల్ని బాగా చూసుకుంటాను. నన్ను నమ్మండని టిమ్ కుక్ను ట్రంప్ కోరాడు. 500 బిలియన్లు సంపాదిస్తున్న మీరు కంపెనీలను అమెరికాలో నిర్మించాల్సింది పోయి, ఇండియాలో పెడుతున్నారని ఇది అమెరికా ప్రయోజనాలకు నష్టం కలగిస్తోందన్నాడు.
మీరు భారతదేశంలో నిర్మాణాలు ఆపేయాలని కోరాడు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటి, కాబట్టి భారతదేశంలో అమ్మడం చాలా కష్టమని అమెరికా అధ్యక్షుడు అన్నారు. అమెరికాపై ఇండియా ఎలాంటి సుంకాలు మోపబోదని ఇండియా ఒక ఒప్పందాన్ని ప్రతిపాదించిందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ట్రంప్ ఇండియా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇండియా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎలాంటి సుంకాలు ఇండియా వేయబోదన్నారు. అమెరికా, ఆపిల్ కంపెనీని బాగా చూసుకుంటుందని.. చైనాలో ఇన్నాళ్లుగా ప్లాంట్లు నిర్మించినా చూసీ చూడనట్టుగా వ్యవహరించాం. ఇప్పుడు ఇండియాలో ప్లాంట్లు నిర్మించడాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని ట్రంప్ స్పష్టం చేశాడు. భారతదేశం తమను తాము చూసుకోగలదని ట్రంప్ అన్నారు.
ఐఫోన్లు, మాక్బుక్లను అమెరికాలోనే ఉత్పత్తిని విస్తరించాలని అమెరికా అధ్యక్షుడు అన్నారు. మొత్తంగా ఇండియాకు వ్యతిరేకంగా, ఆపిల్, ఇకపై ఉత్పత్తులను అమెరికాలోనే చేయాలని ట్రంప్ కోరాడు. ట్రంప్ సర్కార్, సుంకాలతో చైనా నుండి ఇండియాలో ప్రొడక్షన్ చేయాలని ఆపిల్ నిర్ణయించింది. ఈ నెల ప్రారంభంలో టిమ్ కుక్ ఆసక్తికర విషయాలు చెప్పారు.
అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశంలో తయారవుతున్నాయని చెప్పాడు. ఆపిల్ ప్రస్తుతం భారతదేశంలో మూడు ప్లాంట్లున్నాయి. తమిళనాడులో రెండు, ఒకటి కర్ణాటకలో ఉంది. వీటిలో ఒకటి ఫాక్స్కాన్ నిర్వహిస్తుండగా, మిగిలిన రెండింటిని టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. మరో రెండు ఆపిల్ ప్లాంట్లు పైప్లైన్లో ఉన్నాయి. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో, ఆపిల్ భారతదేశంలో $22 బిలియన్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 60 శాతం ఎక్కువ.