టాలీవుడ్
Trsiha: నా కొడుకు చనిపోయాడు.. హీరోయిన్ త్రిష ఎమోషనల్ పోస్ట్..!

Trsiha: క్రిస్మస్ రోజున నా కుమారుడు చనిపోయాడు’అంటూ హీరోయిన్ త్రిష పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. త్రిష పెంపుడు శునకం జోరో ఇవాళ తెల్లవారుజామున మరణించింది. దానికి జోరో అని ముద్దుగా పేరు పెట్టింది. దాన్ని కన్నబిడ్డలా చూసుకుంటోంది. దురదృష్టవశాత్తూ ఆ శునకం ఇవాళ తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. ఈ విచారకరమైన వార్తను త్రిష ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.