తెలంగాణ

విష జ్వరాల విజృంభణ

కొత్తగూడెం జిల్లాలో పినపాకలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ఆస్పత్రులకు జ్వర లక్షణాలతో జనం క్యూ కడుతున్నారు. ఇటీవల వర్షాలతో ఖాళీ స్థలాలు, ప్లాట్లు నీళ్లు నిండి మురుగుకూపాలుగా మారడంతో దోమలు తయారై జ్వరాలు వ్యాపిస్తున్నాయి. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు వ్యాపించి, వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తున్నాయి.

ఏజెన్సీ ప్రాంతాల్లో కుటుంబంలో ఒకరికి జ్వరం వస్తే, క్రమంగా ఇంటిల్లిపాదికి వ్యాప్తి చెందుతున్నాయి. తీవ్రమైన జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, డయేరియా, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, పిల్లలు 50 ఏళ్లకు పైబడి వయసున్న వారు ఎక్కువగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 75 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వైద్యశాఖాధికారులు చెబుతున్నారు.

జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులకు సంబంధించి ఈ సీజన్​ లో ఇప్పటి వరకు 6,313 మంది డెంగ్యూ అనుమానితులకి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఇందులో 75 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజూ వందల సంఖ్యలో వైరల్ ఫీవర్​ కేసులు నమోదవుతున్నాయి. జులై నెల నుంచి జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభావం మొదలైంది. కానీ అధికారులు మాత్రం ఏజెన్సీ ప్రాంతాల్లో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించకుండా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు అధికారులు మాత్రం పెరుగుతున్న వైరల్ ఫీవర్లు, డెంగ్యూ జ్వరాల కేసులపై అప్రమత్తంగా ఉన్నామని చెబుతున్నారు. ఫ్రైడే, డ్రైడే వంటి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు, జ్వరాలు వ్యాప్తి చెందకుండా ప్రయత్నిస్తున్నామని వివరిస్తున్నారు. ఇప్పటికే కేసులు నమోదైన కేసులను బట్టి 90 ప్రాంతాలను హైరిస్క్​ జోన్లుగా గుర్తించి, కేసులు నమోదైన ఇండ్లకు సమీపంలోని వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button