తెలంగాణ
Tirumala: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం

Tirumala: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా చేపట్టారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు. ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించామని ఈవో శ్యామలరావు తెలిపారు.