ఆంధ్ర ప్రదేశ్
Tirumala: మహా కుంభమేళాకు బయల్దేరిన శ్రీవారి కల్యాణ రథం

Tirumala: యూపీలోని ప్రయాగ్రాజ్లో జరగనున్న మహా కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం బయల్దేరింది. కల్యాణ రథానికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూజలు చేశారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా జరగనుంది. యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశామన్నారు బీఆర్ నాయుడు. ఆ ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు.
ఉత్తరాది భక్తులకు స్వామి వారి ఆర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్. జనవరి 18, 26.. ఫిబ్రవరి 3, 12 తేదీల్లో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. కుంభమేళాను దిగ్విజయం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.