తెలంగాణ
మంచిర్యాలలో పెద్దపులి కలకలం.. భయాందోళనలో ప్రజలు

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. బెల్లంపల్లి మండలం కన్నాల పరిసర ప్రాంతాల్లో సంచారిస్తోంది. ఈ పెద్దపులి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో ఏక్షణాన వచ్చి దాడి చేస్తుందోనని జనం భయాందోళన చెందుతున్నారు. సీసీ ఫుటేజ్ను పరిశీలించిన అధికారులు.. B2 పులిగా నిర్ధారించారు.
అటు 15 మంది ఎనిమల్ ట్రాకర్స్ తో.. పెద్దపులి సంచారంపై నిఘా పెట్టారు. పులికి ప్రమాదం తలెత్తకుండా చర్యలు చేపట్టారు. అదేవిధంగా పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక పొలాలకు వెళ్లే రైతులకు.. గుంపులుగాను లేకపోతే కొన్నిరోజులపాటు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.