పాస్టర్ షాలెం రాజు అరెస్టుకు సర్కార్ సిద్ధం

Pastor Shalem Raju: పాస్టర్ షాలెం రాజు వ్యాఖ్యలపై రాజ్న్యూస్ ఇంఫాక్ట్ కనబడింది. పాస్టర్ షాలెం రాజు కోసం ఏపీ కూటమి ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసింది. అంతేకాదు పాస్టర్ షాలెం రాజు అరెస్టుకు సర్కార్ సిద్ధమైంది.
అయితే ప్రస్తుతం కర్ణాటకలో పాస్టర్ షాలెం రాజు ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పాస్టర షాలెం రాజు కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ము మ్మరం చేశారు. కాగా ఇప్పటికే పాస్టర్ షాలెం రాజుపై 250కి పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తుంది.
మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారులన్న షాలెం రాజు వ్యాఖ్యలపై రాజ్న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో రాజ్న్యూస్ కథనాలకు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి బండి సంజయ్, ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. షాలెం రా జుపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చెప్పినట్టుగానే ఏపీ ప్రభుత్వం షాలెం రాజుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.