తెలంగాణ
ఖమ్మంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత

ఆపరేషన్ సిందూర్ విజయం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్డు సమీపంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో పంచాయితీ పీఎస్కు చేరింది. ఎంత సర్ది చెప్పిన ఇరువర్గాలు వినకపోవడంతో పోలీసులు పీఎస్ ఎదుట నుండి చెదరగొట్టారు.
దీంతో రెండు గంటలపాటు పీఎస్ ఎదుట హైడ్రామా నడిచింది. ఇక దాడికి నిరసనగా ఖమ్మంలో బీజేపీ బంద్కు పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలోనే కాసేప ట్లో ఖమ్మం చేరుకోనున్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. మరోవైపు వాగ్వాదంపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు పోలీసులు.