తెలంగాణ
Telangana: దివ్యాంగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Telangana: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వివాహం చేసుకున్న జంటలో ఒక్కరు దివ్యాంగులుంటేనే గతంలో లక్ష వివాహ ప్రోత్సాహం ఇస్తుంది. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే ఈ వివాహ ప్రోత్సహ పథకం వర్తించదు. ఈ సమస్యపై మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపారు. ఇక నుంచి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే లక్ష ప్రోత్సహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.