తెలంగాణ
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై చర్చ

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. సమావేశంలో భాగంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చించనున్నారు. ఎస్సీ వర్గీకరణపై పలు వినతులు వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలు ఖారారు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుతోపాటు హెచ్ఎండీఏ కొత్త యాక్ట్, మైనింగ్ పాలసీపై మంత్రివర్గం చర్చించనుంది. మరికొన్ని కార్యక్రమాలు ‘ఇందిరా మహిళా శక్తి’ ద్వారా అమలు చేయడంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.