ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమలలో అపచారం.. కోడి గుడ్లు, పలావ్ తెచ్చుకున్నా తమిళనాడు భక్తులు

Tirumala: టీటీడీలో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి బట్టబయలైంది. కోడిగుడ్లు, పలావ్ ఉన్న భారీ పాత్రతో ఓ బృందం నేరుగా అలిపిరి మీదుగా తిరుమలకు చేరుకుంది. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు సమీపంలోని గుమ్మడిపూడికి చెందిన 28 మందితో కూడిన ఇతర మతానికి చెందిన ఓ బృందం శుక్రవారం ఉదయం అలిపిరి నుంచి ఘాట్లో తిరుమలకు చేరుకుంది.

రాంభగీచ బస్టాండ్కు సమీపంలోని పార్కింగ్లో వారు తమ వెంట తీసుకువ చ్చిన కోడిగుడ్ల కూర, పలావ్ తింటుండగా చూసిన భక్తులు పోలీసులకు సమా చారమిచ్చారు. పోలీసులు ఆ బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, తిరుమలలో నిబంధనల గురించి తమకు తెలియదని వారు వివరణ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button