Supreme Court: కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్

Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు హాట్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై ధర్మాసనం కన్నెర్ర చేసింది. చెట్ల నరికివేతను సమర్ధిం చుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అంతేకాదు చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని సూచనలు చేసింది. పర్యావరణ పరిరక్షణలో రాజీపడేది లేదని జస్టిస్ గవా య్ బెంచ్ తేల్చి చెప్పింది. ఒకవేళ సీఎస్ను కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలంది. మరోవైపు ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేశారని ప్రభుత్వ లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మినహాయింపులకు లోబడే చెట్లను తొలగించామని చెప్పారు. ప్రస్తుతానికి కంచ గచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశామన్నారు. అదే విధంగా భవిష్యత్లో పునరావృతం కానివ్వమన్న ప్రభుత్వ లాయర్ సుప్రీంకోర్టుకు వివరించారు. మొత్తానికి కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. గతంలో ఇచ్చిన స్టేటస్ కో సుప్రీంకోర్టు కొనసాగుతుందని పేర్కొంది. ఇక తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.