అంతర్జాతీయం
Sunita Williams: భూమి మీద అడుగుపెట్టిన సునీత విలియమ్స్

Sunita Williams: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 8 రోజుల యాత్ర కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లి 9 నెలలు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమిని చేరుకున్నారు.
మంగళవారం ఐఎస్ఎస్ నుంచి స్పేస్ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమి దిశగా పయనం ప్రారంభించిన సునీతా బృందం 17 గంటలపాటు పయనించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది.