అంతర్జాతీయం
Syria: సిరియాలో దారుణం.. 20 మంది మృతి

Syria: సిరియాలోని ఓ చర్చిలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా.. 52 మందికి గాయాలయ్యాయి. సిరియా రాజధాని డమాస్కస్ సమీపంలోని వెలాలో మార్ ఎలియాస్ చర్చిలో ఆత్మాహుతి జరిగింది. ప్రజలు ప్రార్థనలు చేస్తున్న వేళ ఓ దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడు. చనిపోయిన వారిలో చిన్నారులు సైతం ఉన్నారు.
ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఓ ఉగ్రవాది చర్చిలో ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరిపాడని అనంతరం తనను తాను పేల్చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆత్మాహుతి దాడిని సిరియా సమాచారశాఖ మంత్రి హమ్జా మొస్తాఫా ఖండించారు. దీనిని పిరికిపంద దాడిగా అభివర్ణించారు. దుండగుడు తొలుత చర్చిలో గ్రెనేడ్ విసిరేసినట్లు చర్చి బిషప్ తెలిపారు.