ఆంధ్ర ప్రదేశ్
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

Road Accident: ప్రకాశం జిల్లా కొమురోలు మండలం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహానంది దైవదర్శనానికి వెళ్లి వస్తున్న కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు స్టువర్ట్పురం వాసులుగా గుర్తించారు. మృతులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.