ఆంధ్ర ప్రదేశ్
మాజీ మంత్రి కాకాణిని కస్టడీలోకి తీసుకోనున్న సిట్

కాసేపట్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. నేటి నుండి రెండ్రోజులపాటు విచారించనున్నారు. మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో A2గా ఉన్నాడు కాకాణి. ప్రధానంగా గ్రావెల్ అక్రమ రవాణా కేసులో మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సిట్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్టు పీఎస్లో విచారణ జరుగనుంది. సాయంత్రం ఐదు గంటల వరకు విచారించనున్నారు అధికారులు.