Shubhanshu Shukla: 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారతీయుడు

Shubhanshu Shukla: భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. రోదసీలో త్రివర్ణ పతాకం రెపరేపలాడింది. ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి బయల్దేరారు. ఆయన ఈ మిషన్కు పైలట్గా వ్యవహరిస్తున్నారు. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి శుక్లా నేతృత్వంలోని బృందం చేరుకోనుంది.
ఇస్రో-నాసా సంయుక్త మిషన్లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు బయల్దేరారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం యాక్సియం-4 మిషన్ కోసం నలుగురు వ్యోమగాములతో స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ నింగికెగసింది. ప్రస్తుతం రాకెట్ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ మిషన్కు శుక్లా పైలట్గా వ్యవహరిస్తున్నారు. సుమారు 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ఆయన నేతృత్వంలోని బృందం చేరుకుంటుంది.
రోదసి యాత్ర నేపథ్యంలో అర్యోగం కోసం వీరిని దాదాపు నెలకుపైగా క్వారంటైన్లో ఉంచారు. 15 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో భాగంగా నలుగురు సభ్యులు 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఆ జాబితాలో ఏడింటిని భారత శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అలాగే ఈ యాత్రలో భాగంగా అంతరిక్షం నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో శుభాంశు శుక్లా ముచ్చటించనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే ఇప్పటికే ఏడుగురు సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. మాములుగా ఈ యాక్సియం మిషన్ 4.. అంతరిక్ష యాత్ర తొలుత మే 29న జరగాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల పలుమార్లు ఈ యాత్ర వాయిదా పడుతూ వస్తోంది. ఇవాళ మాత్రం అన్ని అడ్డంకులను అధిగమించి ప్రయోగం విజయవంతమయ్యింది.
యాక్సియం 4 స్పేస్ మిషన్లో భాగంగా 28 గంటల పాటు ప్రయాణించి ఈ బృందం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం చేరుకుంటుంది. సాయంత్రం 4.30 గంటలకు వీరి వ్యోమనౌక ఐఎస్ఎస్తో అనుసంధానం అవుతుంది. అక్కడ 14 రోజుల పాటు ఉండి 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తుంది ఈ నలుగురు వ్యోమగాముల బృందం.
అలాగే ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడినుంచి ముచ్చటిస్తారు. భారత్ గగన్యాన్కు శుభాంశు అంతరిక్ష యాత్ర ఎంతో ఉపయోగపడుతుంందని భావిస్తున్నారు. ఐఎస్ఎస్లో శుభాంశు ఇస్రో తరఫున ఏడు ప్రయోగాలు నిర్వహిస్తారు.
ఇందులో శుభాంశు శుక్లా స్వయంగా 7 కీలక ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఇవి జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించినవి. పైగా ఇది భారతదేశం కోసం గగన్యాన్ మిషన్కు ముందడుగుగా పరిగణించబడుతోంది. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది.
రోదసీలో ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు. నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియం-4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు.
తద్వారా ఐఎస్ఎస్లో ఒకే మిషన్లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది. అలాగే అంతర్జాతీయ సహకారంతో భారత అంతరిక్ష పరిశోధనలకు ప్రాధాన్యత పెంచడం కూడా ఈ మిషన్ లక్ష్యాల్లో ఒకటి. పైగా 41 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే మొదటిసారి కావడం వల్ల, ఇది చారిత్రక ఘట్టంగా మారింది.
హ్యూస్టన్కు చెందిన యాక్సియం స్పేస్ నాసా భాగస్వామ్యంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ఇండో – యూఎస్ యాక్సింయా మిషన్ 4ను నిర్వహిస్తామని 2023లో అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశంతో ప్రధాని మోదీ ఒప్పందం చేసుకున్నారు. ఇది భారత్, అమెరికా అంతరిక్ష సహకారానికి నూతన అధ్యాయమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
శుభాంశు శుక్లా రోదసి యాత్ర విజయవంతమవడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లాకు శుభాకాంక్షలు తెలిపారు. శుభాంశు బృందం సరికొత్త చరిత్రను సృష్టించిందని, భారత అంతరిక్ష చరిత్రలో ఇదో కొత్త మైలురాయి అని రాష్ట్రపతి అన్నారు.
ఈ యాత్రపై రోదసి యాత్రపై దేశం మొత్తం గర్వపడుతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఐఎస్ఎస్కు వెళ్లే తొలి భారతీయుడు శుభాంశు కానున్నారని ప్రధాని మోదీ అన్నారు. 1.4 బిలియన్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను తనతో తీసుకెళ్తున్నారని తెలిపారు. శుభాంశు బృందం విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఐఎస్ఎస్లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ఇక భారత ప్రభుత్వం తరఫున Department of Space ఈ మిషన్ కోసం 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 135 కోట్లు అదనంగా కేటాయించారు.
మిగిలిన 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు. ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. ఇది భారతదేశం తరఫున ISSకి వెళ్లే తొలి మిషన్ కావడమే కాదు.. గగన్యాన్ మిషన్కు ముందడుగుగా పరిగణించబడుతోంది.
యాక్సియం-4 మిషన్లో భాగంగా రాకెట్ ఒక్కో దశను విజయవంతంగా దాటుకుంటూ ముందుకు సాగింది. ‘మేం భూకక్ష్యలో తిరుగుతున్నాం భారత్ మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. జైహింద్.. జైభారత్’ అంటూ శుభాంశు సందేశం బయటకు వచ్చింది.
అంతకు ముందు ఆయన మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కేవలం పరికరాలను మాత్రమే వెంట తీసుకెళ్లడం లేదని, వంద కోట్ల మందికిపైగా ఆశలను మోసుకెళ్తున్నానని అన్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఐఎస్ఎస్ అనుసంధానం కోసం డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
అంతరిక్ష యాత్రకు వెళ్తున్న రెండో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్షా. ఇప్పటికే 1984లో రాకేష్ శర్మ అంతరిక్ష యాత్రకు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. 1969లో ఇదే కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టారు. భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల అనంతరం శుభాంశు శుక్లా ఈ యాత్ర చేస్తున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఆ రికార్డ్ను 39 ఏళ్ల శుభాంశు శుక్లా తిరగ రాస్తున్నాడు. కాగా శుభాంశు శుక్లా భారత వైమానిక దళానికి చెందిన అధికారి. ఆయన ప్రస్తుతం యాక్సియం-4 మిషన్లో మిషన్ పైలట్గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి ప్రయాణిస్తున్నారు. ఇది భారతదేశం తరఫున ISSకి వెళ్తున్న తొలి మిషన్ కావడం విశేషం.
స్పేస్లో అడుగుపెట్టగానే జైహింద్ .. జై భారత్ అన్న సందేశాన్ని శుభాంశు శుక్లా పంపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు శుభాంశు శుక్లాను అభినందించారు. ISSలో అడుగుపెడుతున్న తొలి భారతీయుడు శుభాంశు శుక్లా అని ప్రశంసించారు ప్రధాని మోదీ. యాక్సియం-4 ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.
నా భుజాలపై త్రివర్ణ పతాకం ఉంది. మీ సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో యాక్సియం-4 ప్రయాణం చేస్తోందన్నారు శుభాంశు శుక్లా ఈ యాత్ర ఎంతో అద్భుతంగా ఉందని సందేశమిచ్చారు ప్రతి భారతీయుడి ఆశీస్సులు తనకు కావాలన్నారు. శుభాంశు శుక్లా స్వస్థలం లక్నోలో సంబరాలు అంబారన్ని తాకాయి. శుభాంశు పేరంట్స్ కళ్ల నుంచి ఆనంద భాష్పాలు వచ్చాయి.