ఆంధ్ర ప్రదేశ్
Roja: వైసీపీ మాజీ మంత్రి రోజాకి షాక్

Roja: మాజీ మంత్రి రోజాకి షాక్ తగిలింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తు్న్నాయి. ఈ నేపథ్యంలో అక్రమాలపై ఎసిబి దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వైసిపి ప్రభుత్వ హయాంలోలో ఆడుదాం ఆంధ్రా పేరుతో భారీగా నిధులు పక్క దారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిన్న అసెంబ్లీలో దీనిపై చర్చ కూడా జరిగినట్టు సమాచారం. దాదాపు 119 కోట్లు నిధులు ఆడుదాం ఆంధ్రా పేరుతో దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చాయి.