సినిమా

Shalini Pandey: అర్జున్ రెడ్డిపై షాలిని పాండే షాకింగ్ కామెంట్స్..!

Shalini Pandey: విజయ్ దేవరకొండ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా ఎంతటి ఘన విజయం అందుకుందో మనకు తెలిసిందే.ఈ మూవీతో మంచి హిట్ అందుకుంది షాలిని పాండే. ప్రీతి పాత్రలో తన అందం, అమాయకత్వం తో అందరినీ మెప్పించింది. ఓ విధంగా ఈ సినిమా విజయంలో ఆ పాత్ర ప్రభావం చాలా ఉంది.

కానీ తర్వాత మళ్లీ ఆ స్థాయి పాత్ర షాలినీకి రాలేదనే చెప్పాలి. ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు ఏమి రాలేదు. దీంతో బాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని అర్జున్ రెడ్డిలో ప్రీతీ పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

రీసెంట్‌గా షాలిని పాండే ‘డబ్బా కార్టెల్‌’ వెబ్‌సిరీస్‌లో నటించింది. ఆ సిరీస్‌ ఓటీటీలో పెద్ద హిట్‌ అయ్యింది. అందులోని పాత్రకు షాలిని ప్రశంసలందుకుంటున్నది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆమెను ‘అర్జున్‌రెడ్డి’ లాంటి సినిమాలో ప్రీతి తరహా పాత్ర చేయాల్సివస్తే చేస్తారా? అని ఓ విలేకరి అడగ్గా.. ‘నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా అది.

ఇప్పుడు ఆ పాత్ర గురించి ఆలోచిస్తే అమాయకంగా అనిపిస్తుంది. కానీ అదే పాత్రను ఇంకాస్త బలంగా రాయొచ్చు అనుకుంటున్నా. మరోసారి అలాంటి పాత్ర వస్తే చేయనని చెప్పను కానీ.. దర్శకుడితో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకొని అప్పుడు చేస్తా. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు నటిగా పరిణితి చెందాను కాబట్టి ఇంకాస్త భిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తా’ అంటూ చెప్పుకొచ్చింది షాలిని పాండే. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button