వ్యాపారం

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలతో ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, కొన్ని ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కాసేపు లాభాల బాట పట్టాయి. అయితే, ఆటో, ఐటీ, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి.

ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 182 పాయింట్లు నష్టపోయి 81 వేల 451 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 82 పాయింట్ల నష్టంతో 24 వేల750 వద్ద ముగిసింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మరోవైపు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్&టీ, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభాలను ఆర్జించాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button