ఆంధ్ర ప్రదేశ్
Chittoor: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడికక్కడే మృతి

Chittoor: చిత్తూరు జిల్లా వి.కోటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై వెళ్తున్న బైక్ను కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం గర్భిణీ సుమిత్ర మృత్యువుతో పోరాడుతోంది. మృతులు కర్ణాటకలోని కదిరిగానికుప్పం వాసులుగా గుర్తించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.