ఆంధ్ర ప్రదేశ్
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కూలీలు మృతి

Road Accident: బాపట్ల జిల్లా తిమ్మరాజు పాలెం వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. గ్రానైట్ లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మార్టూరు నుండి గుంటూరుకు గ్రానైట్ శ్లాబుల లోడుతో వెళ్తున్న లారీ తిమ్మరాజు పాలెం వద్ద సడెన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు.