ఆంధ్ర ప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద టెంపోను భారీ వాహనం ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు చరణ్, మేఘర్ష్, శ్రావణిగా గుర్తించారు.
క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కర్ణాటకలోని బాగే పల్లికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.