ఆంధ్ర ప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. 9 మందికి తీవ్ర గాయాలు

Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద టెంపోను భారీ వాహనం ఢీకొట్టింది. ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు చరణ్, మేఘర్ష్, శ్రావణిగా గుర్తించారు.

క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను కర్ణాటకలోని బాగే పల్లికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button