తెలంగాణ
Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

Road Accident: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బీర్సాయిపేట్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గండి సమీపంలో చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన వారు ఆదిలాబాద్ వాసులుగా గుర్తించారు.