Rise Survey 2025 : కూటమికి సీన్ రివర్స్.. సర్వే సంచలనం

AP: సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయింది. దీంతో ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ప్రొగ్రెస్ కార్డు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు కూటమి లీడర్లు. తాజాగా చేసిన సర్వే మూడు పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సర్వే రిపోర్టులతో క్యాడర్ అవాక్కైపోతుంది. ఇంతకీ సర్వే చేసిన ఆ సంస్థ పేరేంటి..? నివేదిక వెల్లడించిన షాకింగ్ విషయాలేంటి..? రాయలసీమ, గోదావరి జిల్లాల్లో కూటమి పార్టీల పరిస్థితేంటి..? వాచ్దిస్ స్టోరీ.
ఏడాదిలోనే ఏపీలో సీన్ రివర్స్ అవుతోంది. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేస్తోంది చంద్రబాబు సర్కార్. ప్రతిపక్షాన్ని ఇరుకునపెట్టేలా వ్యూహాలు రచిస్తోంది. ఏడాది కాలంలో కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై రైజ్ సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 2024కు భిన్నమైన పరిస్థితులు ఏర్పడినట్టు సర్వే తెలిపింది. ముఖ్యంగా రాయలసీమలో జరిపిన సర్వే ఉత్కంఠ రేపుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వే చేస్తున్నా రాయలసీమ ఫలితాలు ముందుగా విశ్లేషించింది. వైసీపీ కంచుకోటగా భావించే రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 2024లో సీన్ రివర్స్ అయింది. జగన్మోహనుడి బలం గణనీయంగా తగ్గింది. పులివెందుల, బద్వేల్, రాజంపేట, మంత్రాలయం, తంబళ్లపల్లి, పుంగనూరులో మాత్రమే విజయం సాధించింది వైసీపీ.
ఇప్పుడు రైజ్ సంస్థ చేసిన తాజా సర్వేలో సీన్ పూర్తిగా రివర్స్ కన్పిస్తోంది. రాయలసీమలో అత్యధికంగా 33 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్పష్టంగా ఉందని రైజ్ సంస్థ అభిప్రాయపడింది. కూటమి ఎమ్మెల్యేలకు రాయలసీమలో 2029లో కష్టమేనని రైజ్ సంస్థ తేల్చింది. రెడ్ జోన్లో నలుగురు మంత్రులున్నారని రైజ్ సంస్థ తెలిపింది. తొలిసారి ఎన్నికైన 90 శాతం కూటమి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని తేలింది.
చిత్తూరు పార్లమెంట్ పరిధిలో కుప్పం, పలమనేరు తప్పించి మిగిలిన స్థానాలను కూటమి ప్రభుత్వం మర్చిపోవడం మంచిదని సర్వేలో తేలింది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై వస్తున్న సర్వే నివేదిక ఫలితాలు కూటమి ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నాయి. కొందరు ఈ ఫలితాలను కొట్టిపారేస్తుంటే, మరి కొందరు అలర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలు వైసీపీ వైపు ఉన్నట్టు సర్వేలో తేలింది.
టీడీపీ సీనియర్ల నియోజక వర్గాలు, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పదిలంగా ఉన్నాయి. రాయలసీమ కూటమిలో వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నారని.. ఇది కూడా వ్యతిరేకత రావడానికి కారణమని సర్వేలో తేటతెల్లమైంది. బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నేతలే పెత్తనం చెల్లాయిస్తున్నారు, దీంతో సదరు పార్టీల కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహంతో రగిపోతున్నారట. ఇక కడప పరిస్థితికి వస్తే.. కడపలో ప్రచార ఆర్భాటం ఎక్కువ కానీ, క్షేత్రస్థాయి ఫలితాలు భిన్నంగా ఉన్నాయని తేలింది. ఇవన్నీ ఒకెత్తయితే సీమలోని ఎస్సీ నియోజకవర్గాల్లోని ప్రజలంతా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
కూటమి నుంచి తొలిసారి ఎమ్మెల్యేలకు 2029లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఇప్పటికే కావాల్సినంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే 14 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటం గమనార్హం. ఎందుకంటే.. ఎమ్మెల్యేల్లో సంపాదన పిచ్చి అనేది మితిమీరిపోయిందని రైజ్ సర్వేలో తేలింది. ఎన్నికల ఖర్చులు రాబట్టుకోవాలనే యావతో టార్గెట్లు ఫిక్స్ చేసి మరీ, డబ్బులు సంపాదనలో పడ్డారని తేలిపోయింది.
ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి ఉన్న సీట్లలో, ఎస్సీ స్థానాల్లో సేఫ్ ఫ్యాన్ పార్టీ సేఫ్గా ఉన్నది. ముఖ్యంగా.. మద్యం కమీషన్లు, సెటిల్మెంట్ పేరుతో సర్కారుకు గట్టిగానే చెడ్డపేరు వచ్చేసింది. నెల్లూరు సిటీ, రూరల్లో కూటమికి సానుకూల వాతావరణం ఉంది. ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను శభాష్ అని చెప్పుకోవచ్చని తేలింది. అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్పైనా వ్యతిరేకత ఉందని సర్వేలో తేలింది.
స్పాట్ విజువల్స్
ఉమ్మడి కృష్ణా, గుంటూరులో కూటమికి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. అమరావతిపై వైసీపీ వైఖరితో మెజారిటీ ప్రజలు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. 11 మంది కూటమి ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అనూహ్యంగా గుడివాడలో పాత ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన కొడాలి నానికే నియోజకవర్గ ప్రజలు జై కొడుతున్నారు. ఈ జిల్లాల ప్రస్తుత మంత్రులకు అత్యల్ప మార్కులు తమ సర్వేలో పడ్డాయని ప్రవీణ్ వెల్లడించారు. ఎస్సీ ఎమ్మెల్యేల విషయంలో టీడీపీ- వైసీపీ వైపు చెరిసగం జనాలు ఉన్నారు.
వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా తిరువూరు, గుంటూరు ఈస్ట్, వెస్ట్ నుంచి పోటీచేసిన వారు మిగిలిపోనున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ సింపతీ ఏమాత్రం పనిచేయలేదు. టీడీపీ నుంచి మొదటిసారి ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యేలపై కూడా ఓ రేంజిలో వ్యతిరేకత వచ్చింది. ఇక గోదావరి జిల్లాల విషయానికొస్తే.. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తేలింది.
ఏ జిల్లాలు అయితే 2024లో జనసేనకు పట్టం కట్టాయో.. అదే గోదావరిపై జనసేన పట్టు కోల్పోతున్నది సర్వేలో నిగ్గు తేలింది. మెజారిటీ మెంబర్స్ అంతా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఇక్కడ ప్రభావితం చేస్తున్న అంశాలని రైజ్ సర్వే సంస్థ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ సర్వేపై ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ జిల్లా చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా వైసీపీ వైపే జనాలు మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలో తేట తెల్లమైంది.
టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు అయితే రైజ్ సర్వే సంస్థపై కన్నెర్రజేస్తున్నారు. ఇది ఎంతవరకూ నిజమో..? కూటమి సర్కార్పై నిజంగానే వ్యతిరేకత ఉందా? అనే విషయాలు తెలియాలంటే… 2029 ఎన్నికలు వచ్చేవరకూ వేచి చూడక తప్పదు మరి.