News
Revanth Reddy: సీఎం రేవంత్ని కలిసే యోచనలో తెలుగు సినీ ప్రముఖులు

Revanth Reddy: సంథ్య థియేటర్ ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు. రామ్చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ప్రచారంలో భాగంగా అమెరికాలో ఉన్న నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు హైదరాబాద్కు తిరిగి వచ్చాక సీఎంను కలుస్తామని చెప్పారు.
టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని నాగవంశీ తెలిపారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎంను కలిసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
అలాగే.. ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి చెబుతూనే ఉన్నారని అన్నారు.
అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమాలకు కూడా సపోర్ట్ ఇస్తూనే ఉన్నారని వెల్లడించారు. ఆ సపోర్ట్ అలాగే ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.