తెలంగాణ
Revanth Reddy: రైతు భరోసా 12 వేలు

Revanth Reddy: తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భుములన్నింటికీ రైతు భరోసా ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఎకరాకు ఏడాదికి 12 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు.. ఏడాదికి 12 వేలు ఇవ్వనున్నట్లు రేవంత్ చెప్పారు. జనవరి 26 నుంచి పథకం అమలవుతుందని తెలిపారు. గుట్టలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు.. రైతు భరోసా ఇవ్వమని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు.. రేషన్ కార్డుల లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 26 నుంచి పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు.