తెలంగాణ
KTR: కేటీఆర్కు హైకోర్టులో ఊరట

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. ఉట్నూరు పీఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేసింది. గతేడాది సెప్టెంబర్లో కేటీఆర్పై ఉట్నూరు పీఎస్లో కేసు నమోదైంది. ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో 25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు.
ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు కేటీఆర్పై పలు సెక్షన్ల కింద ఉట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది.