జాతియం
Rajnath Singh: జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్

Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ తాజా పరిస్థితిపై సమీక్షించనున్నారు.
అక్కడ 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయం ఉన్న బాదామి బాగ్ కంటోన్మెంట్ను సందర్శించనున్నారు. నియంత్రణ రేఖ ప్రాంతాన్ని కూడా పరిశీలించనున్నట్లు సమాచారం. అనంతరం రాజ్నాథ్ అక్కడ సైన్యంతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.