తెలంగాణ
Raja Singh: బీజేపీ గతంలో కుల రాజకీయం జరిగింది

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఆరు నెలల్లో వస్తుందని రాజాసింగ్ అన్నారు. గత ఎన్నికల్లో ముస్లిమ్స్ ఓటు బ్యాంక్ని మజ్లీస్ బీఆర్ఎస్కు అమ్మారని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు.
వచ్చే ఉప ఎన్నికల్లో మజ్లీస్ వ్యక్తులు ముస్లిం ఓటు బ్యాంక్ను బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా..? లేక కాంగ్రెస్కు అమ్ముతారా చూడాలన్నారు. బీజేపీ గతంలో కుల రాజకీయం జరిగిందని రాజాసింగ్ అన్నారు. ఇప్పుడు కూడా కుల రాజకీయం జరుగుతుందా లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా అని చూడాలని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.