Raja Singh: కరీంనగర్ నుంచి నాపై యుద్ధం మొదలైంది.. రాజాసింగ్ హాట్ కామెంట్స్

Raja Singh: సొంత పార్టీపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనపై యుద్ధం మొదలైందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్లో తన అభిప్రాయం చెప్పినందుకు కరీంనగర్ నుంచి తన మీద యుద్ధం స్టార్ట్ అయిందని బండి సంజయ్ను ఉద్దేశించి కామెంట్స్ చేసినట్లు టాక్ వినబడుతోంది. కాగా గతంలో కిషన్ రెడ్డికి రాజాసింగ్కు మధ్య బండి సయోధ్య కుదిరించారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం కమల దళంలో మరోసారి చర్చకు దారి తీసింది.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. తాను పార్టీలో ఉన్నంత కాలం అది కుదరదన్న ఉద్దేశంతోనే తనను కేసీఆర్కు దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆరే తన నాయకుడుని, ఇతరుల నాయకత్వంలో తాను పనిచేయనంటూ కవిత చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.