ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: హై అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న మొంథా తూఫాన్

Andhra Pradesh: మొంథా తుఫాన్ దూసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్కి ముప్పు పొంచి ఉంది. ఏపీలో ఏదో ఓ చోట తీరం దాటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 70 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.



