Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచనల ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ ఏడాది చివర్లో జరిగే బిహార్ లో కూడా ఇలాంటి కుట్రకు తెరలేపుతున్నారని విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడే మహారాష్ట్రలో విజయం సాధించిందని అన్నారు.
బీజేపీ ఎక్కడ ఓడిపోతే అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతుందని ఆరోపించారు. బీజేపీ ఎన్నికల రిగ్గింగ్ కు ఎలా పాల్పడుతోంది రాహుల్ గాంధీ తన ఎక్స్ లో వివరించారు. ఐదు పద్దతుల్లో ఎన్నికల రిగ్గింగ్కు జరిగిందన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ను తారుమారు చేయడం.. ఓటర్ జాబితాలో దొంగ ఓట్లను చేర్చడం ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచడం బీజేపీకి అవసరమైన చోట్ల దొంగ ఓట్లను లక్ష్యంగా చేసుకోవడం చివరగా సాక్ష్యాలను దాచిపెట్టడం.
ఈ ఐదు పద్ధతుల ద్వారానే 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు. 2023లో కేంద్రంలోని ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని కూడా రాహుల్ తప్పుబట్టారు. మహారాష్ట్రలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన మహాయుతి కూటమి 288 స్థానాలకు 235 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 132 సీట్లు గెలిచింది.మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 50 సీట్లకే పరిమితమైంది.