ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి సేవలో సినీ నిర్మాత డి.వి.వి. దానయ్య..!

Tirumala: ప్రముఖ సినిమా నిర్మాత డివివి దానయ్య తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. త్వరలో విడుదల కానున్న తన సినిమాలు విజయవంతం కావాలని భగవంతుని ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు.
ఈ నెల 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు, సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఓజీ సినిమాలు భారీ విజయాన్ని సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తీస్తున్న ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే మంచి ప్రమాణాలు కలిగిన సినిమాలని చెప్పారు.