తెలంగాణ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైదరాబాద్కు ప్రభాకర్ రావు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేపు ఇండియాకు రానున్నారు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. రేపు అర్ధరాత్రి హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఎల్లుండి సిట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారి.
ఇందులో భాగంగా ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది ఇండియన్ ఎంబసీ. పాస్పోర్టును రద్దు చేయడంతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్కు ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకోగా, అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రాన్సిట్ జారీ చేశారు.