ఆంధ్ర ప్రదేశ్
Narayana: గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవకతవకలు

Narayana: విశాఖలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్, సీఐడీ విచారణ జరుగుతుందన్నారు మంత్రి నారాయణ. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు తెలిపారు. గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు. విశాఖలోనే కాదు తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు జరిగాయని నారాయణ తెలిపారు.
తణుకులో 63.24 కోట్ల రూపాయాల విలువ ఉన్న చోట 754 కోట్ల బాండ్లు జారీ చేశారని తెలిపారు. రూరల్ ఏరియాలో భూమి తీసుకుని పట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో బాండ్లు ఇచ్చారని పేర్కొన్నారు. తిరుపతిలో 170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేశారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం 965, విశాఖలో 266 టీడీఆర్ బాండ్లు పెండింగ్ లో ఉన్నాయని, మూడు నెలల లోగా బాండ్ల అక్రమాలపై స్పష్టత వస్తుందని నారాయణ పేర్కొన్నారు.