ఆంధ్ర ప్రదేశ్

Modi: నేడు ఏపీకి ప్రధాని మోదీ

Modi: ప్రధాని మోదీ నేడు ఏపీకి రానున్నారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఏకంగా 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా.. పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించేలా పైలాన్ ఆవిష్కరించనున్నారు.

57వేల 940 కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభంకానున్నాయి. ఒక్క అమరావతిలోనే 49వేల 40 కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుడుతారు. అదేవిధంగా 8వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అండ్ నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్‌ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ.

రాజధాని అమరావతి పునఃప్రారంభానికి సూచికగా పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది. ఇక ఈ రీలాంచ్ కార్యక్రమానికి 5లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి ఎనిమిది మార్గాల ద్వారా రాజధానికి చేరుకునేలా రూట్‌మ్యాప్ రెడీ చేశారు. సభకు వచ్చిన వారి కోసం 11చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో మోదీ పాల్గొనే కార్యక్రమాలపై ఆడియో అండ్ వీడియో ప్రదర్శన నిర్వహించారు. అదేవిధంగా అమరావతి విశేషాలపై లఘు వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను ప్రధాని మోదీ తిలకించే విధంగా LCD స్క్రీన్‌లపై టెస్ట్ రన్ నిర్వహించారు.

ఏపీకి ప్రధాని మోదీ రాకతో.. యావత్ దేశం రాజధాని అమరావతి వైపు చూస్తుందన్నారు మంత్రి రాంప్రసాద్. మోదీ సభకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌.

డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులు ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాకారంతో అమరావతి మరింత అభివృద్ధి చెందుతుందంటున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button