ఆంధ్ర ప్రదేశ్
PM Modi: తిరుపతిలో తొక్కిసలాట ఘటన బాధాకరం

PM Modi: తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీలోని విశాఖకు మోదీ వచ్చిన రోజే ఈ ఘటన జరిగింది. తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడం చాలా దురద్రుష్టకరం అని ప్రధాని మోదీ అన్నారు. వారి మరణానికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఘ సానుభూతి తెలియజేశారు.