తెలంగాణ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇద్దరికి బెయిల్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. భుజంగరావు, రాధాకిషన్రావుకు హైకోర్టులో బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. లక్ష పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. పాస్పోర్టులు సమర్పించాలి… అలాగే… పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశాలిచ్చింది.