GVMC: విశాఖ మేయర్గా పీలా శ్రీనివాసరావు

GVMC: GVMC మేయర్గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి.. కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్గా కూటమి అభ్యర్థి, టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించి.. ఆయనకు ధ్రువపత్రం అందజేశారు.
మహా విశాఖ నగర పాలక సంస్థకు 2021లో ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును అధిష్ఠానం ప్రకటించింది. అప్పట్లో మెజార్టీ లేకపోవడంతో ‘పీలా’కు పదవి దక్కలేదు. నాలుగేళ్ల పాటు పార్టీ బలోపేతానికి చేసిన కృషితో పాటు, వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడిన పీలా శ్రీనివాసరావుకు పార్టీ అధిష్ఠానం ఇప్పుడు మరోసారి అవకాశం కల్పించింది.
అయితే ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందా అంటూ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది.