ఆంధ్ర ప్రదేశ్

పవన్ అంటే పేరు కాదు.. పవర్

Pawan Kalyan: పవన్ అంటే పేరు కాదు పవర్. దేశ రాజకీయాల్లో ఓ సంచలనం దశాబ్దకాలం పాటు ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డాడు. రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ఏర్పాటులో కీరోల్ ప్లే చేయడమే కాదు. ఎన్నికల సమరంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సక్సెస్ సాధించి చరిత్ర సృష్టించారు. ఆయన రాజకీయ వ్యూహాలు మేధావులకు సైతం అంతుచిక్కవనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆయన పొలిటికల్ కత్తికి రెండు వైపులా పదునే ఉంటుంది. ఆయన వ్యూహం వైసీపీకి ఉన్న 40శాతం ఓటు బ్యాంకును మరింత డైల్యూట్ చేయడం వచ్చే ఎన్నికల్లోనూ కూటమిని విజయతీరాలకు చేర్చడమే. అయితే ఈ విషయంలో జనసేనలో ఒకింత తడబాటు కనిపిస్తోందట. జనసేనాని అనుసరిస్తున్న వ్యూహంపై కేడర్ అసహనం వ్యక్తం చేస్తుందట. ఇంతకీ పవన్ వ్యూహామేంటి..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువులా మారిన పవన్ కల్యాణ్ జాతీయ స్థాయిలోనూ పవర్ లీడర్ గా ఎదిగే దిశలో అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్రపోషించి డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి పాలనలో తనదైన ముద్ర వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబే అయినా సొంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయించుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగారు.

అయితే ఆది నుంచి జనసేన అధినేతను సీఎంగా చూడాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఈ విషయంపై పవన్ ఎక్కడా క్లారిటీ ఇవ్వడం లేదు. తాను ఎప్పుడు సీఎం అవుతానన్నది ఆయన చెప్పకుండానే 15ఏళ్లు కలిసి కొనసాగుతామంటూ కూటమిని ప్రస్తావిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తారు. అంటే.. ఇప్పుడు పవన్ అన్న మాటల ప్రకారం వచ్చే 15 ఏళ్ల పాటు ఆయన సీఎం అయ్యే అవకాశం లేదున్నది స్పష్టమవుతోంది. ఇదే జనసేనను ఇబ్బందికి గురిచేస్తోంది.

మరో రెండు మూడు ఎన్నికల వరకు తాము ఓర్పుతో ఉండకతప్పదన్న ఆలోచన జనసేనలో కనిపిస్తుంది. అయితే ఇది శాస్వతమేనా..? అనేది కూడా చర్చకు తావిస్తుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి సహజంగానే ప్రజల్లో ప్రభుత్ం వ్యతిరేకత పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది.

రాజకీయ పార్టీ పెట్టి పదేళ్లయినా ఓ ఎమ్మెల్యే లేడు కనీసం ఎంపీపీ గాని జడ్పీటీసీ గాని లేకున్నా ఒంటరి పోరాటం చేస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ఢీకొన్నారు. వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేసి అవమానించినా సంయమనం పాటిస్తూ రాజకీయ విలువలు పాటిస్తూ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల క్షేత్రంలోనే తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. వైసీపీ అధినేత జగన్ ఆయన సైన్యం ఎంత గట్టిగా విమర్శిస్తే అంతకంటే రెట్టింపు స్వరంతో తిప్పికొడుతూ. ఏపీ రాజకీయాల్లో సంచలనం కాదు. అంతకు మించిన ప్రభంజనం సృష్టించారు.

ఘోర ఓటముల నుంచి అఖండ విజయం దాకా విలక్షణ రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన ఏకైక పార్టీగా జనసేనను తీర్చిదిద్దారు. అయితే కూటమి ప్రభుత్వంతో పొత్తు ఉండడం వల్ల ఈ వ్యతిరేకత జనసేనకు కూడా ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని పవన్ ఊహించకుండా ఉండరు. ఒకవేళ ఇదే నిజమై ప్రభుత్వ వ్యతిరేకత కనుక పెరిగితే.. అప్పుడు ప్లాన్ -బీ ని అమలు చేయడం ఖాయమని మరో చర్చ కూడా జరుగుతోంది.

ఇక వచ్చే ఎన్నికలకు ముందుగానే ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేసుకుని అవసరమైతే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఓటర్లను మెప్పించే అవకాశం ఉంటుందన్న అంచనా వస్తోంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంలో ఉంటూనే పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. అటు కేంద్రంలోనూ పవన్ కు మంచి పట్టు సాధించారు.

మోడీ అమిత్ షాలతో సానిహిత్యం పెరిగింది. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పార్టీని తప్పించేందుకు తాము 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలని అనుకున్నా కొన్ని కారణాలతో బయటకు వచ్చామని చెప్పడంతోపాటు డిప్యూటీ సీఎంగా తాను పరిణితి చెందానన్న వాదనను కూడా పవన్ వినిపించే అవకాశం ఉంది. తద్వారా వ్యతిరేక ఓట్లను చీలకుండా చీలినా వైసీపీకి పడకుండా పక్కా వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం.

ఇక ఏపీలో రాజకీయంగా టీడీపీకి ధీటుగా నిలబడాలి అంటే ఏమి చేయాలో అన్నది పవన్ ఇపుడు ఆలోచిస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో జనసేనకు 21 సీట్లు దక్కాయి. అలాగే ఆరేడు శాతం ఓటు బ్యాంక్ సొంతం అయింది. కానీ ఏపీలో నలభై శాతం ఓటు బ్యాంక్ పొందడమే పవన్ మార్క్ టార్గెట్ అని అంటున్నారు. అది జరగాలంటే ఏపీలో బలంగా ఉన్న టీడీపీ, వైసీపీలో ఒక పార్టీ పొలిటికల్ గా ఎలిమినేట్ కావాలి. టీడీపీ గ్రాస్ రూట్ లెవెల్ దాకా బలంగా ఉంది.

పైగా నారా లోకేష్ ఆ పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా బలంగా ఉన్నారు. దాంతో టీడీపీని దెబ్బ తీయడం అసాధ్యం. అదే సమయంలో వైసీపీ తీరు చూస్తే ఒంటి స్తంభం మేడలా ఉంది. ఇక వైసీపీకి జగన్ ఎంత బలమో అంత బలహీనం కూడా అని గడచిన కాలంలో రుజువు అయింది. ఆ పార్టీకి సర్వం సహా జగనే. ఆయన చుట్టూనే అల్లుకున్న పార్టీ.

ఇదే అదునుగా భావించిన పవన్ వైసీపీలో ఉన్న వారిని తన పార్టీలోకి రావడానికి తలుపులు తెరిచారు. వైసీపీ చుట్టూ ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటే కనుక ఏపీ రాజకీయాల్లో జనసేన తిరుగులేని పార్టీగా ఎదుగుతుదని భావిస్తున్నారు. ఒక కీలక సామాజిక వర్గం నాయకులను కొనియాడుతున్నారు. వారికి జనసేన అండగా ఉంటుందని చెబుతున్నారు.

ఏపీలో ఉన్న సామాజిక రాజకీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకున్న వారు ఎవరైనా కూటమి అధికారంలో ఉంటే ఓట్లు చీలకుండా ఉంటే వైసీపీకి కష్టమే అని భావిస్తారు. అలా వైసీపీ నేతలలో కూడా చర్చ రావాలని ఆ విధంగా వారు జనసేన వైపుగా అడుగులు వేయాలన్నదే పవన్ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.

రాజకీయాల్లో రెండు రెళ్ళు నాలుగు అన్ని వేళలలో కావు అని అంటారు. వైసీపీలో ఉన్న వారు అంతా అనుభవం ఉన్న వారే. పైగా పొత్తుల ఎత్తులు అన్ని ఎన్నికల్లోనూ పారతాయా అంటే అది కూడా డౌటే అని చెబుతారు. ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో ఎలాంటి పొరపొచ్చాలు లేకపోయినా, భవిష్యత్ లో రావన్న గ్యారంటీ లేదు. అందుకే ముందు చూపుతో ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలను పార్టీలోకి తీసుకుంటున్నారన్న టాక్ గాజుగ్లాసు పార్టీలో ఓపెన్ టాక్ అయింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button