Pastor Shalem Raju: మల్లెపూలు పెట్టుకునే హిందూ మహిళలను “బజారు ఆత్మలు” అంటూ కామెంట్స్

మల్లెపూలు పెట్టుకునే హిందూ స్త్రీలు బజారు ఆత్మలట.. మల్లె పూలను విసర్జించే క్రైస్తవ మహిళలు పరిశుద్ధ ఆత్మలట ఇలాంటి బజారు వాగుడు వాగింది ఎవరో కాదు క్రైస్తవ మత ప్రబోధకుడనని చెప్పుకునే పాస్టర్ షాలెం రాజు. మల్లెపూలు పెట్టుకునే హిందూ మహిళలను కించ పరుస్తూ నోరు పారేసుకోవడమే కాకుండా ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ వార్తను ప్రసారం చేసిన రాజ్ న్యూస్ పై క్రైస్తవులను రెచ్చగొట్టి పాస్టర్ షాలెం రాజు ట్రోల్స్ చేయిస్తున్నాడు.
తన చెంచాగాళ్లను ఉసిగొల్పి మల్లె పూలు పెట్టుకునే హిందూ మహిళలు వేశ్యులంటూ నీచమైన భాషతో కామెంట్లు చేయిస్తూ షాలెం రాజు పైశాచిక ఆనందం పొందతున్నాడు. పైగా భారతదేశంలో సనాతన ధర్మాన్ని అనుసరించే వారంతా దాన్ని ఆధారాలతో ప్రూవ్ చేస్తే కానీ క్రైస్తవులు అంగీకరించరట అంతే కాకుండా మల్లె పూలు పెట్టుకునే హిందూ మహిలలను కించ పరచే విధంగా షాలెంరాజు వ్యాఖ్యలు చేయడం తప్పని మహిళలు ఎవరైనా హితవు పలికితే వారి కాపురం చక్కబెట్టుకోవాలని, అసలు మీరు పతివ్రతా అని నీచంగా ప్రశ్నిస్తూ షాలెంరాజు బ్యాచ్ దిగజారుడు కామెంట్లతో ట్రోలింగ్ చేస్తున్న తీరుపై హిందూ సంఘాలు మండి పడుతున్నాయి.
హిందూ మహిళలు తన మానాన తాము సనాతన ఆచార వ్యవహారాలను ఫాలో అవుతుంటే మల్లెపూలను సాకుగా చూపి, బజారు కామెంట్లు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో షాలెంరాజును హిందూ సంఘాలు నిలదీస్తున్నాయి. క్రైస్తవుల మెప్పు పొందడం కోసం మల్లెపూల ముసుగులో హిందూ మహిళలపై విషం కక్కడమే కాకుండా ఇప్పుడు పెయిడ్ బ్యాచ్ తో తన వాదనను సమర్దించుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న షాలెంరాజు ఒక విషయాన్ని గుర్తించాలి.
హిందూ ధర్మాన్ని పరిరక్షించే విషయంలోనూ, హిందూ మహిళలను కించ పరిచే వ్యాఖ్యలు చేసే ప్రబుద్ధులకు వ్యతిరేకంగా పోరాడే విషయంలోనూ రాజ్ న్యూస్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. ఈ విషయాన్ని పాస్టర్ షాలెం రాజు వంటి ఛాందస వాదులు తెలుసుకోవాలి. రాజ్ న్యూస్ పై తన చెంచాగాళ్లను ఉసిగొల్పి ట్రోల్స్ చేయిస్తున్న షాలెం రాజు బాగోతాన్ని త్వరలో రాజ్ న్యూస్ వెలుగులోకి తెస్తుంది. హిందూ మహిళలను కించ పరచే తన వైఖరిని మార్చుకోవాలని హిందూ సంఘాల ద్వారా పోరాటాన్ని కొనసాగిస్తుంది.
ఇప్పటికైనా రాజ్ న్యూస్ పై ట్రోల్స్ చేయించే చిల్లర రాజకీయాన్ని షాలెం రాజు మానుకుంటే మంచిది. ఇప్పటికే విద్వేషాలపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరికలు పంపిస్తున్నారు. సనాతనాన్ని కించపరిస్తే తాట తీస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా షాలెం రాజు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించాలని సనాతనవాదులు కోరుకుంటున్నారు.