సినిమా

మన శంకరవరప్రసాద్‌ గారు నుంచి ఫ్యామిలీ ప్రేక్షకులకు బిగ్ రిలీఫ్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు లేకుండా రిలీజ్ చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలు రేకెత్తిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలోకి వస్తోంది. ఈ నిర్ణయం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే ఇటీవల చాలా సినిమాలు టికెట్ ధరలు పెంచుతుండగా, ఈ చిత్రాన్ని మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి హైక్ లేకుండా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. మేకర్స్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడం సాధారణ ప్రేక్షకులకు ఊరట కలిగిస్తుంది.

గతంలో చాలా చిత్రాలు, ఆంధ్రప్రదేశ్‌లో హైక్‌లతో రిలీజ్ అవ్వడంతో మధ్యతరగతి కుటుంబాలు సినిమాలు వెళ్లడం మానేశాయి. అది కొంత ప్రభావం చూపించింది. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’కు అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ భారీగా థియేటర్లకు రావడానికి అవకాశం ఉంది. ఈ నిర్ణయం బాక్సాఫీస్ వద్ద సానుకూల ఫలితాలు ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button