ఆంధ్ర ప్రదేశ్
కుప్పంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari: చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి శాంతిపురం నివాసంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్థానికుల నుంచి అర్జీలు స్వీకరించిన భువనేశ్వరి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కుప్పం ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు భువనేశ్వరి. ఇక స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ఈ సందర్భంగా భువనేశ్వరి అభినందించారు. అనంతరం దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాల పంపిణీ చేశారు.



